హైదరాబాద్: కరోనా రోగులకు ఫ్రీగా వైద్యం అందేలా చూడాలని వైఎస్పార్ టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాదకర కేటగిరీలో చేరుస్తూ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ విషయంపై షర్మిల స్పందించారు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆమె ఫైర్ అయ్యారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చామని చేతులు దులుపుకోకుండా, అందరికీ ఉచిత వైద్యం అందేలా చూడాలన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలని.. ప్రతి ఒక్కరికీ రెండు డోసుల టీకా అందేలా చూడాలని కోరారు.
కరోనా 2nd వేవ్ లో డాక్టర్లుంటే బెడ్స్ లేక, బెడ్స్ ఉంటే ఆక్సిజన్ లేక జనం పిట్టల్లా రాలిపోతుంటే
— YS Sharmila (@realyssharmila) November 29, 2021
పారాసిటమోల్ వేసుకంటే సరిపోతుందని
ప్రజల ప్రాణాలను గాలికొదిలేసిన దొరగారు కనీసం ఇప్పుడైనా చేతులు కాలినంక ఆకులు పట్టుకోకుండా ప్రజల ప్రాణాలను కాపాడండి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి.1/1
గతంలో కరోనాతో నష్టపోయిన కుటుంబాలకు వైద్య బిల్లులు చెల్లించాలని షర్మిల చెప్పారు. సెకండ్ వేవ్ సమయంలో డాక్టర్లు, బెడ్స్ లేక జనాలు పిట్టల్లా రాలిపోతుంటే కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని, ప్రజల ప్రాణాలను గాలికొదిలేశారని మండిపడ్డారు. ఇప్పుడైనా జనాల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చామని చేతులు దులుపుకోకుండా, కరోనా వైద్యం ఉచితంగా అందేలా చూడండి. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టండి. ప్రతి ఒక్కరికి కరోనా రెండు డోసులు వ్యాక్సిన్ అందేలా చెయ్యండి. గతంలో కరోనాతో ఇల్లు గుల్లయినా కుటుంబాలకు కరోనా వైద్య బిల్లులు చెల్లించండి. 2/2
— YS Sharmila (@realyssharmila) November 29, 2021