చంపుతామని సోషల్ మీడియాలో బెదిరిస్తున్నరు : వైఎస్ సునీతా రెడ్డి

చంపుతామని సోషల్ మీడియాలో బెదిరిస్తున్నరు : వైఎస్ సునీతా రెడ్డి

గచ్చిబౌలి, వెలుగు :  తనను చంపుతామంటూ సోషల్ మీడియాలో కొందరు బెదిరిస్తున్నారని.. తనకు వారి నుంచి ప్రాణహాని ఉందని వైఎస్ సునీతా రెడ్డి శుక్రవారం సైబరాబాద్​లోని సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసింది.  

సునీతా రెడ్డిని చంపుతామంటూ కొందరు వ్యక్తులు ఫేస్ బుక్​లో పోస్టులు పెడుతున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేసినట్లు సైబర్ క్రైమ్ డీసీపీ శిల్పవల్లి డీసీపీ తెలిపారు. ఫిర్యాదును స్వీకరించామని.. దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.