ఏపీలో YSR అవార్డులు ప్రదానం చేసిన జగన్

ఏపీలో YSR  అవార్డులు ప్రదానం చేసిన జగన్

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే భారతరత్న, పద్మ అవార్డుల తరహాలోనే ఏపీలోనూ అత్యున్నత  పౌర పురస్కారాలు ఇస్తున్నామని చెప్పారు సీఎం వైఎస్ జగన్ మోహన్  రెడ్డి. అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేసిన వైఎస్ఆర్ పేరుతో  YSR సాఫల్య, YSR  జీవన సాఫల్య పురస్కారాలను ప్రకటించామన్నారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్  సెంటర్ లో నిర్వహించిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో గవర్నర్  బిశ్వభూషణ్  హరిచందన్  తో పాల్గొన్నారు. 29 మందికి YSR  జీవన సాఫల్య, 30 మందికి YSR  సాఫల్య పురస్కారాలను అందజేశారు. YSR  జీవన సాఫల్య పురస్కారానికి 10 లక్షల నగదు, YSR సాఫల్య పురస్కారానికి రూ.5 లక్షల నగదు ఇచ్చారు. అవార్డుల ఎంపికలో కులం, మతం, ప్రాంతం, రాజకీయ నేపథ్యం చూడలేదన్నారు. వివిధ రంగాల్లో సేవలు అందించి పురస్కారాలు అందుకున్న ప్రతీ ఒక్కరికీ అభినందనలు తెలిపారు గవర్నర్ . అంతకు ముందు ఏపీ అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండా ఎగురవేశారు సీఎం జగన్.

మరిన్ని వార్తల కోసం

పెట్రోల్ ధరలపై మహేష్ బాబు ఫొటోతో సజ్జనార్ ట్వీట్ 

నో డైలాగ్స్: సస్పెన్స్ తో వచ్చిన RRR టీజర్

స్టూడెంట్స్‌తో కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా