![ఫైనల్ స్టేజ్లో షర్మిల పార్టీ విలీన చర్చలు](https://static.v6velugu.com/uploads/2023/09/YSRTP-merger-talks-with-Congress-have-reached-the-final-stage_nB7QWSA1Ul.jpg)
కాంగ్రెస్లో షర్మిల పార్టీ విలీనం చర్చలు తుది దశకు వచ్చాయి. తాజాగా సోనియా, రాహుల్తో ఆమె ఢిల్లీలో మీటింగ్ తర్వాత షర్మిలకు కర్నాటక నుంచి రాజ్యసభ ఆఫర్ చేశారన్న ప్రచారముంది. పాలేరు సీటు గురించి షర్మిల పట్టుబట్టినా, కాంగ్రెస్ అందుకు రెడీగా లేదని తెలుస్తోంది. స్టార్ క్యాంపెయినర్ హోదాతో పాటు రాజ్యసభ సీటిస్తామని చెప్పినట్టు సమాచారం.
విలీన చర్చల సమయంలో సికింద్రాబాద్ బరిలో ఉండాలని చెప్పినట్టు ప్రచారం జరిగినా, చివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో ఎలాంటి పోటీ లేకుండా రాజ్యసభ సీటు, స్టార్ క్యాంపెయినర్ పదవి, ఏపీలో పీసీసీ చీఫ్ బాధ్యతల అప్పగింత లాంటి అంశాలపైనే డిస్కషన్స్ జరిగాయని తెలుస్తున్నది. కాగా, షర్మిల రెండేండ్లుగా పాలేరులో పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.