నజారాలో కామత్​ బ్రదర్స్​

నజారాలో కామత్​ బ్రదర్స్​
  • రూ. 100 కోట్ల పెట్టుబడి

ముంబై: ఆన్​లైన్​ గేమింగ్​, స్పోర్ట్స్​ కంపెనీ నజారా టెక్నాలజీస్​ లిమిటెడ్​లో జెరోధా బ్రదర్స్​ నిఖిల్​, నితిన్​ కామత్​లు రూ. 100 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. కామత్​ బ్రదర్స్​కు చెందిన కామత్​ అసోసియేట్స్​, ఎన్​కేస్క్వేర్డ్‌‌ల నుంచి నిధులు సమీకరించనున్నట్లు నజారా టెక్నాలజీస్​ ప్రకటించింది. పై రెండు కంపెనీలకు కలిపి 7,00,280 ప్రిఫరెన్షియల్​ షేర్లను జారీ చేసి రూ. 99.99 కోట్లు సేకరించనున్నట్లు వెల్లడించింది. 

తమ పట్ల, గేమింగ్ టెక్నాలజీ పట్ల నిఖిల్​ కామత్‌కు ఉన్న నమ్మకానికి తాజా పెట్టుబడులు నిదర్శనంగా నిలుస్తాయని నజారా టెక్నాలజీస్​ పేర్కొంది. స్ట్రాటజిక్​ ఎక్విజిషన్లతో పాటు, ఇతర కంపెనీలలో పెట్టుబడి పెట్టడానికి తాజా నిధులను వాడనున్నట్లు నజారా టెక్​ సీఈఓ నితిష్​ మిట్టర్​ సెయిన్​ వెల్లడించారు. రాబోయే ఏళ్లలో దేశంలో గేమింగ్​ ఇండస్ట్రీ భారీ గ్రోత్​ సాధించనుందని ఈ సందర్భంగా నిఖిల్​ కామత్​ అన్నారు. ఈ అవకాశాన్ని నజారా అందిపుచ్చుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. నజారాకు గ్రోత్​ కోసం తగిన సాయం అందిస్తామని వెల్లడించారు.