Farzi : అత్యధికంగా వీక్షించిన ఇండియన్ సిరీస్‌గా 'ఫర్జీ'

Farzi : అత్యధికంగా వీక్షించిన ఇండియన్ సిరీస్‌గా 'ఫర్జీ'

రీసెంట్ డేస్ లో ఇంట్రస్టింగ్ అండ్ యాక్షన్ కథాంశంగా తెరకెక్కిన సిరీస్ లో 'ఫర్జీ' ఒకటి. ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, హీరోయిన్ రాశీ ఖన్నా, కేకే మీనన్, భువన్ అరోరా, రెజీనా కసాండ్రా, అమోల్ పాలేకర్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 10న స్ట్రీమింగ్ అయిన ఈ సిరిస్.. ఆల్ టైమ్ మోస్ట్ వాచ్ డ్ ఇండియన్ సిరీస్ గా నిలిచింది. ది ఫ్యామిలీ మ్యాన్ తర్వాత ఆ స్థాయిలో ఫర్జీ మంచి హిట్ ను నమోదు చేసింది.

నకిలీ కరెన్సీ నోట్ల నేపథ్యంలో సాగే ఫర్జీ సిరీస్ ను ఇప్పటివరకూ 37.1మిలియన్ల మంచి చూశారని ఓర్మాక్స్ మీడియా నిర్వహించిన ఓ సర్వేలో తెలిపింది. ఫర్జీ.. అత్యధికంగా వీక్షించిన భారతీయ సిరీస్ అని వెల్లడించింది. ఈ విషయాన్ని నటుడు షాహిద్ కపూర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అంతే కాకుండా ఫర్జీ ఫీవర్. థ్యాంక్యూ ఆల్ సో మచ్ అనే క్యాప్షన్ తో పాటు రెండు లవ్ సింబల్స్ ను చేర్చారు.

https://www.instagram.com/p/CqLbqgFDlLT/