సింప్లీ ది బెస్ట్.. లక్నో బిర్యానీపై జపనీస్ అంబాసిడర్ ప్రశంసలు

సింప్లీ ది బెస్ట్.. లక్నో బిర్యానీపై జపనీస్ అంబాసిడర్ ప్రశంసలు

రాయబారి జపాన్ రాయబారి హిరోషి సుజికి తన భారత దేశ పర్యటనలో భాగంగా లక్నోకు చేరుకున్నాడు. అనంతరం ఆయన అక్కడి బిర్యానీని ఆస్వాదిస్తూ కనిపించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది సోషల్ మీడియా దృష్టిని ఎంతగానో ఆకర్షించింది.

హైదరాబాద్, కోల్ కత్తా బిర్యానీ లలో ఏది ఉత్తమమైనది అని ఇప్పటికే చర్చ సాగుతుండగా తాజాగా జరిగిన సంఘటన ఈ చర్చకు మరో కొత్త కోణాన్ని జోడించింది. తన లక్నో పర్యటన సందర్భంగా జపాన్ రాయబారి హిరోషి సుజికి స్థానిక బిర్యానీని ఆస్వాదించారు. తాను ఇప్పటివరకు ఇలాంటి బిర్యానీని రుచి చూడలేదని, ఇది ఉత్తమమైనదిగా ఆయన కొనియాడాడు. అతని ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హిరోషి తన బిర్యానీ తిన్న అనుభవాలను పంచుకోవడానికి ఎక్స్ ఖాతాను ఎంచుకున్నాడు. దాంతో పాటు ఒక చిన్న వీడియోను కూడా పోస్ట్ చేశాడు. ఇందులో ఒక హై లెవెల్ రెస్టారెంట్లో బిర్యానీ పైపింగ్ హార్ట్ ప్లేట్ ను అందిస్తున్నట్లు కనిపించాడు. ఆ వంటకం పట్ల అతని ఉత్సాహం ఈ క్లిప్ లో స్పష్టంగా కనిపిస్తోంది. మరొక చిత్రంలో అతను తాజాగా సిద్ధం చేసిన బిర్యానీ కుండ ముందు కూర్చున్నట్లు చూపిస్తుంది. "నేను వరుసగా రెండు రోజులు గా లక్నో  బిర్యానీని రుచి చూస్తున్నాను. ఇది నేను ఇప్పటివరకు తిన్న బిర్యానీలలో ఉత్తమమైనది" అని హిరోషి క్యాప్షన్లో జోడించారు.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో అత్యంత త్వరగా వైరల్ కావడంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. హైదరాబాది, బెంగాలీ బిర్యానీలను కూడా రుచి చూసి ఏది ఉత్తమమైనదో చెప్పాలని కొందరు నెటిజెన్లు కోరారు. మరొకరు హైదరాబాద్ బిర్యానీని ప్రయత్నించమని సూచించారు. దాంతోపాటు లక్నోలోని ప్రసిద్ధమైన గలౌటి కబాబ్స్, సీక్ కబాబ్స్ వంటి స్థానిక వంటకాలను కూడా రుచి చూడమని ఇంకొందరు సిఫార్సు చేశారు.

రాయబారి జపాన్ రాయబారి హిరోషి సుజికి తన భారత దేశ పర్యటనలో భాగంగా లక్నోకు చేరుకున్నాడు. అనంతరం ఆయన అక్కడి బిర్యానీని ఆస్వాదిస్తూ కనిపించారు.