రాజంపేట వరదల్లో 12 మంది మృతి  

రాజంపేట వరదల్లో 12 మంది మృతి  

 భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలు అతాలకుతలం అయ్యాయి. భారీ వరదలతో కడప జిల్లా రాజంపేటలో ప్రాణ నష్టం సంభవించింది. దాదాపు 30 మంది వరదనీటిలో కొట్టుకు పోగా.. ఇప్పటి వరకు 12 మృతదేహాలు వెలికితీశాయి రెస్క్యూ బృందాలు.  నందలూరు పరివాహక ప్రాంతంలోని మందపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతంలో 3 ఆర్టీసీ బస్సులు వరదనీటిలో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సులోని కండక్టర్‌, ఇద్దరు ప్రయాణికులు వరద నీటిలో కొట్టుకుపోయారు. 

నందలూరు వద్ద ఆర్టీసీ బస్సులో 3 మృతదేహాలను వెలికితీశారు. గండ్లూరు శివాలయం సమీపంలో 7, రాయవరంలో 3 మృతదేహాలు వెలికితీశారు. 30మంది వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయినట్లు అధికారులు చెబుతున్నా.. స్థానికులు మాత్రం ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.