ఎల్లరెడ్డిపేటలో 40 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

ఎల్లరెడ్డిపేటలో 40 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

ఎల్లరెడ్డిపేట, వెలుగు: అక్రమంగా నిల్వచేసిన 40 క్వింటాళ్ల రేషన్​బియ్యాన్ని గురువారం టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఎస్ఐ రాహుల్ రెడ్డి వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బీనవేని దేవయ్య వివిధ గ్రామాల నుంచి రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బియ్యం కొని డంప్​ చేశాడు. 

సమాచారం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్, ఎల్లారెడ్డిపేట పోలీసులు అతని ఇంటిపై దాడి చేసి  40 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. నిందితుడిని స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు తరలించారు. దేవయ్యపై కేసు నమోదు చేసినట్లు టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు.