నిర్మల్/భైంసా, వెలుగు: మహారాష్ట్రలోని నాసిక్ గోదావరి నది జన్మస్థానం నుంచి 400 మంది సాధువులు, మహాపురుషులతో ప్రారంభమైన పరిక్రమ (ప్రదక్షిణ)యాత్ర మంగళవారం భైంసా మీదుగా నిర్మల్ కు చేరుకుంది. వివిధ ధార్మిక సంఘాలు, అర్చక సంఘాలు, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులతోపాటు వివిధ కుల సంఘాలు, పలువురు పీఠాధిపతులు ఘన స్వాగతం పలికారు. ఆధ్యాత్మిక బాటలో నడుచుకోవాలని, నదులను పరిరక్షించుకోవాలని సూచించారు. భైంసా మండలం మాటేగాంలో పూజలు చేశారు.

