
బెల్లంపల్లి, వెలుగు: మార్వాడి యువ మంచ్, ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని మహేశ్వరి భవన్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. మొత్తం 52 మంది రక్తదానం చేశారని రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు అభినవ సంతోష్ కుమార్ తెలిపారు.
రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జీ సురభి శరత్ కుమార్, బ్లడ్ బ్యాంక్ సీనియర్ సూపర్వైజర్ మాధవి, పీఆర్వో రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.