లక్నో: ఉత్తరప్రదేశ్లోని లక్నో జైలులో 63 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్ నిర్ధారణ అయింది. గత ఏడాది డిసెంబర్ లో నిర్వహించిన పరీక్షల్లో 36 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్ అని తేలిందని, ప్రస్తుతం జైలులో హెచ్ఐవీ సోకిన ఖైదీల సంఖ్య 63కి చేరుకుందని జైలు అధికారులు తెలిపారు. వైరస్ సోకిన ఖైదీల్లో ఎక్కువ మందికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని, జైలు బయట ఒకరు ఉపయోగించిన సిరంజిని మరొకరు ఉపయోగించడం వల్ల వైరస్ ఎక్కువ మందికి వ్యాపించి ఉంటుందని జైలు అధికారులు పేర్కొన్నారు.
జైలులోకి వచ్చిన తర్వాత ఏ ఖైదీకి హెచ్ఐవీ సోకలేదని ప్రకటించారు. సెప్టెంబరు నుంచి హెచ్ఐవీ టెస్టింగ్ కిట్లు అందుబాటులో లేకపోవడంతో డిసెంబర్ వరకు టెస్ట్లు నిర్వహించలేదని, దీంతో వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించి ఉంటుందని పేర్కొన్నారు.