అక్షయ తృతీయ సేల్స్​ తక్కువే!

అక్షయ తృతీయ సేల్స్​ తక్కువే!

ముంబై: ఈసారి అక్షయ తృతీయకు బంగారం అమ్మకాలు పెద్దగా ఉండకపోవచ్చని గోల్డ్​ ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.కరోనా సెకండ్​ వేవ్​ దేశాన్ని కుదిపేస్తున్న టైములో గోల్డ్​ కొనడానికి కస్టమర్లు ముందుకు రాకపోవచ్చని ఆందోళన చెందుతోంది. అక్షయ తృతీయ కిందటేడాది లాక్​డౌన్​ టైములు అంటే ఏప్రిల్​ 26న వచ్చింది. ఈ ఏడాది మే 14న వస్తుంది. చాలా రాష్ట్రాలలో లాక్​డౌన్​లు, రెస్ట్రిక్షన్లు అమలవుతున్నాయి. దీంతో సేల్స్​ దెబ్బతింటాయని భావిస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి బంగారం కొనడానికి ఇష్టపడతారని తామనుకోవడం లేదని ఇండియన్​ బులియన్​ అండ్​ జ్యుయెలరీ అసోసియేషన్​ సెక్రటరీ సురేంద్ర మెహతా చెప్పారు.కొనాలనుకునే కస్టమర్లు గోల్డ్​ షాపు ఓనర్లకు  ఫోన్​ చేసి,  ఇంటికే రప్పించుకోవాలని రికమెండ్​ చేస్తున్నట్లు చెప్పారు. పెద్ద జ్యుయెలర్లు అందరూ డిజిటల్​ గోల్డ్​ కొనాలని ఎంకరేజ్​ చేస్తున్నారని మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్ పేర్కొంది.