అవినాశ్‌‌ సాబ్లేకు డైమండ్‌‌ లీగ్‌‌ ఫైనల్‌‌ బెర్త్‌‌

అవినాశ్‌‌ సాబ్లేకు  డైమండ్‌‌ లీగ్‌‌ ఫైనల్‌‌ బెర్త్‌‌

జియమెన్‌‌ (చైనా): ఇండియా అథ్లెట్‌‌ అవినాశ్‌‌ సాబ్లే  ఈ సీజన్​ డైమండ్‌‌ లీగ్‌‌లో  స్టీపుల్‌‌ఛేజ్‌‌ ఈవెంట్‌‌ ఫైనల్‌‌కు క్వాలిఫై అయ్యాడు. శనివారం జరిగిన జియమెన్‌‌ మీట్‌‌లో సాబ్లే 8 నిమిషాల 16.27 సెకండ్లతో ఐదో స్థానం సాధించాడు. ఐదు పాయింట్లు రాబట్టిన అతను ఈ సీజన్‌‌లో నాలుగు మీట్స్​ ద్వారా మొత్తం 11 పాయింట్లతో ఆరో ప్లేస్‌‌తో ఫైనల్‌‌ బెర్తు దక్కించుకున్నాడు. ఈ నెల 16న అమెరికాలోని యుజిన్‌‌లో ఫైనల్‌‌ జరగనుంది.