
- సారంగాపూర్ ఎస్సై శ్రీకాంత్కు కూడా..
భైంసా/సారంగాపూర్, వెలుగు: భైంసా సీఐ గోపీనాథ్, సారంగాపూర్ ఎస్సై శ్రీకాంత్ సీఎం చేతుల మీదుగా ఉత్తమ పోలీస్ రియల్ హీరో అవార్డులు అందుకున్నారు. నిర్మల్ డీసీఆర్బీగా పని చేస్తున్న సమయంలో గోపీనాథ్, సారంగాపూర్ఎస్సై శ్రీకాంత్ విశేష సేవలందించారు. గత వానాకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా సారంగాపూర్మహబూబ్ ఘాట్ వద్ద అర్ధరాత్రి ఓ కారు అదుపు తప్పి లోయలో బోల్తా పడగా సమాచారం అందుకున్న గోపీనాథ్, ఎస్సై శ్రీకాంత్ వెంటనే అక్కడకు చేరుకొని క్షతగాత్రులను కాపాడి వారిని క్షేమంగా హాస్పిటల్కు తరలించారు. శాంతిభధ్రతల పరిరక్షణ, కమ్యూనిటీ పోలీసింగ్, విద్యార్థుల నేర ప్రవృత్తిని అరికట్టే కార్యక్రమాలు, మహిళల భధ్రతపై ప్రత్యేక చర్యలు, రాత్రి గస్తీ వ్యవస్థలో వినూత్న కార్యక్రమాలు అమలు చేశారు.
విధి నిర్వాహణ, శాంతి భధ్రతల పరిరక్షణలో చూపిన నిబద్ధతకు ప్రతిఫలంగా ఈ అవార్డు దక్కింది. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ పోలీస్ రియల్ హీరో-2025 కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గోపీనాథ్, శ్రీకాంత్ వేర్వేరుగాఅవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులతో పాటు సిబ్బంది ఆయనను అభినందించారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యత పెంచిందని సీఐగోపీనాథ్ అన్నారు.