
- భారతీయ కిసాన్ సంఘ్ విజ్ఞప్తి
- బాసర టెంపుల్ నుంచి భైంసాకు రైతుల పాదయాత్ర
బాసర, వెలుగు: ఇటీవల కురిసిన వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, సోయా పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ కోరింది. మంగళవారం నిర్మల్జిల్లా బాసర ఆలయం నుంచి భైంసా వరకు పాదయాత్రను చేపట్టారు. ముందుగా కిసాన్ సంఘ్సభ్యులు అమ్మవారిని దర్శించుకుని పాదయాత్ర మొదలుపెట్టారు.
సోయా పంట చేతికి వచ్చినా ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముథోల్ పశుపతి నాథ్ శివాలయంలో బసచేసి బుధవారం ఉదయం భైంసా సబ్ కలెక్టర్ ఆఫీసు ముందు నిరసన వ్యక్తం చేసి, అనంతరం వినతి పత్రం అందిస్తామని కిసాన్ సంఘ్ సభ్యులు తెలిపారు.