కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో BJP ఎంపీలు నిరసన

కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో BJP ఎంపీలు నిరసన

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్‌ను దుర్వినియోగం చేస్తోందని బుధవారం కర్ణాటక బీజేపీ ఎంపీలు పార్లమెంట్ జంతర్ మంతర్ ముందు నిరసన వ్యక్తం చేశారు. సిద్ద రామయ్య  ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ వారు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్ణాటకలో ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ప్రభుత్వాన్ని నడపడం చాతకాక వివాదాతతో తరచూ ఢిల్లీకి వస్తున్నారని ఎంపీ లైహర్ సింగ్ విమర్శించారు. డికే కుమార్ సీఎం కావాలనుకున్నారు కానీ ఆయన్ని సీఎం చేయలేక పోయారని లైహర్ అన్నారు.  

కర్ణాటకకు చెందిన కొందరు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కొంతకాలంగా ట్యాక్స్ డిట్రిబ్యూషన్ , గ్రాంట్ల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని నిరసన చేస్తున్న విషయంపై బీజేపీ ఎంపీలు ఈ రోజు మండ్డిపడ్డారు. బీజేపీ ఎంపీల నిరసనకు మద్దతిస్తూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ స్పందిస్తూ కర్ణాటక ప్రభుత్వం అబద్దాల ప్రభుత్వమని Xలో తెలిపారు.