సీఎంను కలిసిన సుదర్శన్రెడ్డి

సీఎంను కలిసిన సుదర్శన్రెడ్డి

బోధన్​, వెలుగు: ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులైన బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి శనివారం సీఎం రేవంత్​రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. భార్య సుచరితతో కలిసి వెళ్లిన సుదర్శన్​రెడ్డిని సీఎం దంపతులు ఆహ్వానించి సన్మానించారు. టీపీసీసీ చీఫ్ మహేశ్​గౌడ్ కూడా సుదర్శన్​రెడ్డిని అభినందించారు. కాంగ్రెస్ జిల్లా నాయకులు ఉన్నారు.