
కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లాలో పలు వివాహ వేడుకలకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మంచిర్యాలకు చెందిన అంకం నరేశ్ కొడుకు సాయి అఖిల్–-హిమేశ్వరి దంపతులను, మందమర్రి మండలం పులిమడుగులో తిరుపతి–స్రవంతి, కాసీపేట మండలం పల్లంగూడలో మహేశ్–స్నేహశ్రీ, బెల్లంపల్లిలోని పద్మశాలి భవన్లో సాయిచందన–-సునంద్, కోటపల్లి మండలం రాంపూర్లో మేకర్తి మహేశ్వరి–-సంతోష్ దంపతులను ఆశీర్వదించారు. చెన్నూరులో మానుష–విజయ్ ఎంగేజ్మెంట్కు, మైనారిటీ షాదిఖానాలో చైతన్య–మౌనిక రిసెప్షన్కు హాజరయ్యారు.
మందమర్రి పట్టణం అంగడిబజార్లోని శ్రీశివకేశవ, సంజీవ ఆంజనేయస్వామి దేవాలయానికి సంబంధించిన ఆర్చ్ను ప్రారంభించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మందమర్రికి చెందిన కాంగ్రెస్ నేత బండి శంకర్ను పరామర్శించారు. మందమర్రి మండల వ్యాప్తంగా 70 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్చెక్కులు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మందమర్రి తహసీల్దార్సతీశ్ కుమార్, మున్సిపల్కమిషనర్ రాజలింగు, భీమారం పంచాయతీరాజ్ఏఈ రాజ్కుమార్, కాంగ్రెస్ లీడర్లు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.