కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలి

కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలి

గ్రేటర్​వరంగల్, వెలుగు: జిల్లాలోని ప్రజలందరూ కమ్యూనిటీ మీడియేషన్​సెంటర్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా న్యాయమూర్తి వీబీ నిర్మల గీతాంబా అన్నారు. గురువారం సిటీలోని దయానంద్​కాలనీ, శాయంపేట, పోతన గ్రంథాలయాల్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ మీడియేషన్​ సెంటర్లను జిల్లా న్యాయమూర్తి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబ సభ్యుల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య, వచ్చే వివిధ రకాల తగాదాలను కమ్యూనిటీ మీడియేషన్​ సెంటర్ల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సివిల్​జడ్జి ఎం.సాయికుమార్, కేంద్ర మేడియేటర్​కో కన్వీనర్​ మల్లారెడ్డి, ఎ.రాజేంద్ర ప్రసాద్, జి.జగ్గారావు, కాలనీ వాసులు తదితరులున్నారు.