కోల్బెల్ట్: దళితులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి

కోల్బెల్ట్: దళితులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి

కోల్​బెల్ట్, వెలుగు: నేల మైలపడిందని, దళితులను అవమానించే రీతిలో బీఆర్​ఎస్​అధినేత కేసీఆర్ ​ఫామ్​హౌజ్​వద్ద పసుపునీళ్లతో శుద్ధి చేసిన ఘటనను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ అను దళితులకు కేసీఆర్​ క్షమాపణ చెప్పాలి బంధ ఎస్సీ సెల్​ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జిల్లా ఎస్సీ సెల్​చైర్మన్​ పైడిమల్ల నర్సింగ్​నేతృత్వంలో లీడర్లు, కార్యకర్తలు శుక్రవారం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. 

ప్లకార్డులతో అంబేద్కర్​ విగ్రహాం ఎదుట నిరసన వ్యక్తంచేశారు. పసుపునీళ్లతో శుద్ధి చేయడం ముమ్మాటికీ కుల వివక్షేనని, బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని డిమాండ్​చేశారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికార ప్రతినిధి పొట్ట మధుకర్, వైస్​చైర్మన్​జుంజుపల్లి నర్సింగ్, నూనె నర్సయ్య, ఎ.నాగరాజు, కె.సతీశ్, జి.బానేశ్, రవి తదితరులు పాల్గొన్నారు.