దాడుల సంస్కృతి బాల్క సుమన్దే..

దాడుల సంస్కృతి బాల్క సుమన్దే..
  • మంత్రి వివేక్ ​వెంకటస్వామిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోం

కోల్​బెల్ట్, వెలుగు: చెన్నూరు నియోజకవర్గంలో దాడులు చేయడం, బెదిరింపులు పాల్పడటం, అక్రమాలకు పాల్పడే సంస్కృతి బాల్క సుమన్​దేనని కాంగ్రెస్​ లీడర్లు ఆరోపించారు. మంగళమవారం మందమర్రిలోని కాంగ్రెస్​ ఆఫీస్​లో మీడియా సమావేశంలో కాంగ్రెస్​ సీనియర్ లీడర్లు సొతుకు సుదర్శన్, పుల్లూరి లక్ష్మణ్​​ ​మాట్లాడారు. ​మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఐ పార్టీలకు చెందిన 14 మంది మోజార్టీ కౌన్సిలర్లు ఉన్నప్పుడు పాలకవర్గం విషయంలో బీఆర్ఎస్​ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ఇద్దరు కాంగ్రెస్ ​కౌన్సిలర్లను బాల్క సుమన్​నిర్బంధించి బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. మున్సిపల్​ చైర్​పర్సన్​ పదవి చేజారిపోతుందనే బాల్క సుమన్ ​తన అనుచరులతో కలిసి మంత్రి వివేక్​ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్​పై రాళ్ల దాడి చేయించాడని మండిపడ్డారు.

ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్​లో సుమన్​దాడులు, అరాచకాల సంస్కృతిని మళ్లీ మొదలుపెట్టాడన్నారు. మహిళ కౌన్సిలర్లను అవమానించేలా సుమన్​ అసభ్యకరంగా మాట్లాడి వారిని కించపరిచాడని ఫైర్ ​అయ్యారు. కాకా కుటుంబంతో బాగుపడ్డ బీఆర్ఎస్ ​లీడర్ మద్ది శంకర్​ విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. అభివృద్ధిని ఓర్వలేక మంత్రి, కాంగ్రెస్ ​పార్టీపై బీఆర్ఎస్​లీడర్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్ నేతలు పైడిమల్ల నర్సింగ్, ఉపేందర్​గౌడ్, మంద తిరుమల్, పాషా, ఎన్.శ్రీనివాస్, జమీల్, రమేశ్, ఎర్ర రాజు, మాయ తిరుపతి, వెంకటేశ్, సంతోష్, వీరన్న​తదితరులు పాల్గొన్నారు.