V6 News

జిల్లాలోని ప్రధాన సెంటర్లలో కూలింగ్ సెంటర్ల ఏర్పాటు

జిల్లాలోని ప్రధాన సెంటర్లలో కూలింగ్ సెంటర్ల ఏర్పాటు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో కూలింగ్​సెంటర్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ అంకిత్​ ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో అధికారులతో రివ్యూ నిర్వహించారు. వడదెబ్బ బాధితులకు ఉపశమనం కల్పించేలా కూలింగ్ సెంటర్లలో కూలర్లు, ఫ్యాన్లు, విశ్రాంతి సదుపాయాలు కల్పించాలన్నారు.

ఉపాధి హామీ పని స్థలాల్లో వర్కర్ల కోసం షామియానాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి అంగన్​వాడీ కేంద్రం, ఆశా వర్కర్ల వద్ద ఓఆర్ఎస్​ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రైతు ముంగిట శాస్త్రవేత్తల ప్రోగ్రాంలో రైతులు అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా వాల్​ పోస్టర్లను ఆవిష్కరించారు. వచ్చే నెల 10వ తేదీ వరకు స్వీయ గణన ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. అనంతరం గ్రీవెన్స్​లో పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు.