కామారెడ్డిటౌన్, వెలుగు : సీపీఐ పార్టీ స్థాపించి వంద ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాసర నుంచి చేపట్టిన యాత్ర రేపు సాయంత్రం కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకుంటుందని ఆ పార్టీ కామారెడ్డి జిల్లా సెక్రటరీ ఎల్. దశరథ్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. కొత్త బస్టాండు వద్ద సభ ఉంటుందన్నారు.
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్యపద్మ, ప్రతినిధులు వలిపుల్లాఖాద్రి, నరేంద్ర ప్రసాద్ తదితరులు వస్తున్నారని తెలిపారు. డిసెంబర్ 25న ఖమ్మంలో 100 ఏండ్ల ఉత్పవాల ముగింపు సభ ఉంటుందన్నారు. యాత్రకు కామారెడ్డి ప్రజలు, ఆయా వర్గాల ప్రతినిధులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు రాజమణి, బత్తుల ఈశ్వర్, మల్లేష్, ప్రవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
