స్కూల్స్, హాస్టళ్లు, ఆస్పత్రులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్లు

స్కూల్స్, హాస్టళ్లు, ఆస్పత్రులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్లు

రేగొండ/ గూడూరు/ హసన్​పర్తి/ జనగామ అర్బన్, వెలుగు: ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని పలు ప్రభుత్వ స్కూల్స్, హాస్టళ్లు, ఆస్పత్రులను ఆయా జిల్లాల కలెక్టర్లు బుధవారం తనిఖీలు చేశారు. జయశంకర్​భూపాలపల్లి జిల్లా రేగొండ మహాత్మాజ్యోతి బాపూలే గురుకులాన్ని ఆ జిల్లా కలెక్టర్​ రాహుల్​శర్మ, మహబూబాబాద్​ జిల్లా గూడూరు పీహెచ్​సీ, కేజీబీవీ, జడ్పీహెచ్​ఎస్​ను కలెక్టర్​ అద్వైత్​కుమార్​ సింగ్,  హనుమకొండ జిల్లా హసన్​పర్తి మండలం పీహెచ్​సీ, ఎమ్మార్వో ఆఫీస్, కేజీబీవీని కలెక్టర్​ స్నేహ శబరీష్​ ఆకస్మిక తనిఖీలు చేశారు. 

ఈ సందర్భంగా వారు విద్యార్థులకు అందుతున్న భోజనం, విద్యపై ఆరా తీశారు. ఆస్పత్రుల్లో రికార్డులను పరిశీలించి, సీజనల్​ వ్యాధుల పై అలర్ట్​గా ఉండాలని, నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. జనగామ మండలం చౌడారం తెలంగాణ ప్రభుత్వ బాలికల మోడల్​ స్కూల్​ను అడిషనల్​ కలెక్టర్​ పింకేశ్​ కుమార్​ సందర్శించారు. రాష్ట్రీయ బాల్​ స్వస్తియ కార్యక్రమం కింద విద్యార్థులకు నిర్వహిస్తున్న వైద్య పరీక్షలను పర్యవేక్షించారు.