దివ్య జ్ఞాన సమాజం

 దివ్య జ్ఞాన సమాజం

 దివ్యజ్ఞాన సమాజాన్ని 1875లో అమెరికాలోని న్యూయార్క్​లో హెచ్​.పి.బ్లావట్స్కి, ఎంఎస్​ అల్కాట్, విలియం క్వాన్​ జడ్జ్​లు స్థాపించారు. 1882లో దివ్య జ్ఞాన సమాజం అంతర్జాతీయ కార్యాలయాన్ని మద్రాస్​లోని అడయార్​కు మార్చారు. ఈ సంస్థ మొదటి అధ్యక్షుడు ఆల్కాట్​, రెండో, చివరి అధ్యక్షురాలు అనీబిసెంట్​. ఈ సమాజ ప్రధాన లక్ష్యం మానవ సేవ. ప్రాచీన మతాలైన హిందూ, బౌద్ధ, జుడాయిజం మతాల సమ్మేళనం కోసం దివ్యజ్ఞాన సమాజం ప్రయత్నించింది. 

ముఖ్య ఉద్దేశాలు: విశ్వమావన సౌభ్రాతృత్వం, అన్ని మతాల అంతిమ లక్ష్యం మోక్షం. ప్రకృతి, మానవుని లోపల ఉండే అంతర్గత శక్తులను పరిశోధన చేయాలి.
నమ్మకాలు: పునర్జన్మను నమ్మింది, ఉపనిషత్, సాంఖ్య, యోగా, వేదాంతాల నుంచి స్పూర్తి పొందింది. 

అనీబిసెంట్​

ఈమె ఐర్లాండ్​కు చెందిన ఐరిష్​ జాతి మహిళ. అయితే ఈమె లండన్​లో జన్మించింది. అసలు పేరు అనీవుడ్​. ఈమెన్​ డైమండ్​ సోల్​గా అభివర్ణిస్తారు. హెచ్​.పి. బ్లావట్స్కి రహస్య సిద్ధాంతం అనే వ్యాసాన్ని చదివి ప్రభావితమైన అనీబిసెంట్​ 1888 లండన్​లో దివ్యజ్ఞాన సమాజంలో చేరింది. 1893లో ఇండియాకు వచ్చింది. కల్నల్​ ఆల్కాట్​ మరణానంతరం 1907లో దివ్యజ్ఞాన సమాజానికి అనీబిసెంట్​ అధ్యక్షత వహించింది.

 ఈమె 1916లో చిత్తూర్​లోని మదనపల్లెలో బిసెంట్​ థియోసఫికల్​ కాలేజ్​(జాతీయ కళాశాల)ను స్థాపించింది. దీని మొదటి ప్రిన్సిపల్​ హెచ్​.జె. కజిన్స్​. 1898లో వారణాసిలో కేంద్ర హిందూ కళాశాలను నెలకొల్పగా, 1916లో మదన్​మోహన్​ మాలవ్య బెనారస్​ హిందూ యూనివర్సిటీగా మార్చాడు. ఇక్కడ హిందూ మతం, పాశ్చాత్య శాస్త్రీయ సబ్జెక్టులను బోధించేవారు.