విద్యార్థులు చెడు వ్యసనాలకు లోనుకావొద్దు

విద్యార్థులు చెడు వ్యసనాలకు లోనుకావొద్దు

కామారెడ్డిటౌన్​, వెలుగు :  విద్యార్థులు చెడు వ్యసనాలకు లోనుకావొద్దని  జిల్లా మానసిక వైద్యాధికారి డాక్టర్​ రమణ పేర్కొన్నారు. మంగళవారం   ఆరోగ్య,  ఎక్సైజ్​ శాఖల ఆధ్వర్యంలో కామారెడ్డి ప్రభుత్వ జూనియర్​ కాలేజీలో అవగాహన సదస్సు నిర్వహించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీనేజీ వయస్సులో  వచ్చే అవరోధాలను జయిస్తే అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారన్నారు.    మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. ఎక్సైజ్​ సీఐ సంపత్​, ఇన్​చార్జి ప్రిన్సిపాల్ ఇర్పాన,  సీడబ్ల్యూసీ మెంబర్​ స్వర్ణలత,  సైక్రియాటిక్​ సోషల్ వర్కర్ రాహుల్​ తదితరులు పాల్గొన్నారు.