కొనుగోళ్లలో స్పీడ్ పెంచండి : డీఆర్డీవో సురేందర్

 కొనుగోళ్లలో స్పీడ్ పెంచండి : డీఆర్డీవో సురేందర్
  • డీఆర్డీవో సురేందర్​

లింగంపేట, వెలుగు: ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డీఆర్డీవో సురేందర్​ సూచించారు. మంగళవారం లింగంపేటలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు.  తూకానికి సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని తేమశాతం చూసి కాంటా పెట్టాలన్నారు. 

కేంద్రాల్లో నిర్వహణ సక్రమంగా ఉండాలని ధాన్యం సేకరణ, స్టాక్​ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు.  రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట మార్కెటింగ్ డీపీఎం సాయిలు, ఏపీఎం వినోద్, సీసీలు గంగరాజం పాల్గొన్నారు.