గురుగ్రామ్​ వద్ద 40 ఎకరాల స్థలం కొన్న ఎలన్ ​ గ్రూప్​

గురుగ్రామ్​ వద్ద 40 ఎకరాల స్థలం కొన్న ఎలన్ ​ గ్రూప్​

న్యూఢిల్లీ: గురుగ్రామ్​ వద్ద 40 ఎకరాల స్థలాన్ని ఇండియాబుల్స్​ రియల్​ ఎస్టేట్​ నుంచి ఎలన్​ గ్రూప్​ కొనుగోలు చేసింది. ఈ డీల్​విలువ రూ. 580 కోట్లు. హౌసింగ్​, కమర్షియల్​ ప్రాజెక్టులను ఈ స్థలంలో చేపట్టనున్నట్లు ఎలన్​ గ్రూప్​ వెల్లడించింది. ద్వారకా ఎక్స్​ప్రెస్​ హైవే దగ్గర ఈ స్థలం ఉంది. 50 లక్షల చదరపు అడుగులలో నిర్మాణానికి ఈ స్థలంలో వీలుంటుందని ఎలన్​ గ్రూప్​ వెల్లడించింది. ఇప్పటికే మూడు కమర్షియల్​ ప్రాజెక్టులను పూర్తి చేసిన ఎలన్​ గ్రూప్​ మరో అయిదు కమర్షియల్​ ప్రాజెక్టులనూ అమలు చేస్తోంది. మొత్తం 40 ఎకరాలలో 30 ఎకరాల విస్తీర్ణంలో రెసిడెన్షియల్​ ప్రాజెక్టులను, మిగిలిన 10 ఎకరాలలో కమర్షియల్​ ప్రాజెక్టులనూ ఎలన్​ గ్రూప్​ చేపడుతుంది. ఇండియాబుల్స్​ రియల్​ ఎస్టేట్​కు ఇప్పటికే ఎలన్​ గ్రూప్​ అడ్వాన్స్​ చెల్లించిందని, రాబోయే నెలల్లో డీల్​ పూర్తవుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.