
రాయపర్తి/ తొర్రూరు (పెద్దవంగర), వెలుగు: రైతులు బాగుండడమే తమ ఉద్దేశమని, వారంలోపు సాగునీళ్లు ఇవ్వాలని లేకుంటే సీఎం ఇంటి ఎదుట ధర్నా చేస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా రాయపర్తి కార్యకర్తల సమావేశం, మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగరలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. పెద్దవంగర, దేవరుప్పుల, తొర్రూరు, కొడకండ్ల, సూర్యపేట జిల్లా, మహబూబాబాద్ జిల్లా, వర్ధన్నపేట, వరంగల్ జిల్లా అంతా ఎస్సారెస్పీ, కాళేశ్వరం నీటితో ఆధారపడి ఉన్నారన్నారు.
పంటలు ఎడిపోయే పరిస్థితి ఉందని వారం రోజుల్లో నీళ్లు ఇవ్వకుంటే పోరాటం చేస్తామన్నారు. అనంతరం పెద్ద వంగర మండల పరిధిలోని బొమ్మకల్, చిట్యాల గ్రామాల్లో బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు.