- ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్రెడ్డి
నిజామాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన విద్యారంగాన్ని సీఎం రేవంత్రెడ్డి సర్కార్ సరిదిద్దుతోందని ప్రభుత్వ సలహాదారుడు పి.సుదర్శన్రెడ్డి అన్నారు. శుక్రవారం నగరంలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో కొత్తగా నిర్మించిన హాస్టల్ బిల్డింగ్ను ప్రారంభించి మాట్లాడారు. దేశ భవిష్యత్ నిర్మాణంలో యూత్ భాగస్వామ్యులు కావాలని సూచించారు. షబ్బీర్అలీ మాట్లాడుతూ ఆధునీక సాంకేతిక విద్య అందుబాటులోకి తేవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం 66 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేసిందన్నారు. వాటిలో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు దక్కేలా కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు.
ఎడ్యుకేషన్ హబ్ చేస్తం.. టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్గౌడ్
ఇందూర్ జిల్లాను ఎడ్యుకేషన్ హబ్గా మార్చుతామని టీపీసీసీ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. ఇందులో భాగంగా ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేశామని, ఇప్పుడు తెలంగాణ వర్సిటీలో అగ్రికల్చర్ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. హాస్టల్ బిల్డింగ్ నిర్మాణానికి రూ.కోటి 6 లక్షల విరాళమిచ్చిన పాలిటెక్నిక్ కాలేజీ పూర్వ విద్యార్థి ప్రతాప్రెడ్డి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.2.86 కోట్ల నిధులిచ్చిన బీహెచ్ఈఎల్ సంస్థకు చెందిన అసిస్టెంట్ జీఎం సెల్వంను సన్మానించారు.
కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కార్పొరేషన్ చైర్మన్ లు మానాల మోహన్రెడ్డి, తాహెర్, డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, కాలేజీ ప్రిన్సిపాల్ భారతి పాల్గొన్నారు.
బోధన్లో సుదర్శన్రెడ్డి ఘన స్వాగతం..
బోధన్ : ప్రభుత్వ సలహదారుడు సుదర్శన్రెడ్డికి కాంగ్రెస్శ్రేణులు బోధన్ పట్టణంలోని ఆచన్పల్లి కమాన్ వద్ద జేసీబీతో పెద్ద గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. టీటీడీ కల్యాణ మండపంలో సుదర్శన్రెడ్డిని సన్మానించారు. ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి మాట్లడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని చూసి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఘన విజయం కట్టబెట్టారన్నారు. రాబోవు కౌన్సిలర్లు, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. బోధన్ మున్సిపాలిటికి రూ.18కోట్లు వచ్చాయని తెలిపారు. ఉర్దు అకాడమిక్ చైర్మన్ తాహెర్, జిల్లా గ్రంథాలయ జిల్లా చైర్మన్ అంజిరెడ్డి రాజరెడ్డి, డీసీసీబీ చైర్మెన్ రమేశ్రెడ్డి, కాంగ్రెస్ బోధన్ పట్టణ అధ్యక్షుడు పాషామోయినొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
