
హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్కు తాగునీటిని సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు (కేడీడబ్ల్యూఎస్పీ) ఫేజ్-3 పైప్లైన్లో రాజేంద్రనగర్ వద్ద 1400 ఎంఎం డయా పైప్లైన్లో భారీ లీకేజీ ఏర్పడింది. దీనిని సరిచేయడానికి అత్తాపూర్ మూసీ వంతెన వద్ద 300 ఎంఎం స్కవర్ వాల్వ్ ఎక్స్టెన్షన్ పైప్లో లీకేజీ రిపేర్, మైలార్దేవ్పల్లి ఫేజ్-3 పంప్ హౌస్లో పనిచేయని వాల్వ్ల మార్పిడి పనులు చేపట్టనున్నారు.
సోమవారం ఉదయం 11 గంటల నుంచి మంగళవారం ఉదయం 7 గంటల వరకు 20 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు రోజులపాటు షేక్పేట, జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్, ప్రశాసన్నగర్, తట్టిఖానా, గచ్చిబౌలి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతుందని మెట్రోవాటర్ బోర్డు తెలిపింది.