దాడులు ఆపకపోతే..టెహ్రాన్ అగ్నిగోళం అవుతుంది:ఇజ్రాయెల్ రక్షణ మంత్రి

దాడులు ఆపకపోతే..టెహ్రాన్ అగ్నిగోళం అవుతుంది:ఇజ్రాయెల్ రక్షణ మంత్రి

ఇజ్రాయెల్,ఇరాన్ పరస్పర దాడులతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. ఇరాన్ క్షిపణి దాడుల క్రమంలో శనివారం (జూన్ 14) ఇజ్రాయెల్ రక్షణ్ మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులు ఆపకపోతే టెహ్రాన్ నగరాన్ని మొత్తం కాల్చి బూడిద చేస్తామని హెచ్చరించారు. 

జూన్ 13న ఇరాన్ అణు , సైనిక స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సీనియర్ కమాండర్లు అణుశాస్త్రవేత్తలతో సహా 78 మంది మృతిచెందారు. ప్రతీకారంగా ఇరాన్.. ఇజ్రాయెల్ భూభూగంలో డ్రోన్లు, 150 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. జెరూసలేం, టెల్ అవీవ్, రిషాన్ లెజియాన్, రామత్ గాన్ లలో భారీ విధ్వంసం జరిగిం ది. ముగ్గురు ఇజ్రాయెలీలు చనిపోగా.. డజన్లకొద్ది పౌరులు గాయపడ్డారు. 

దాడులు, ప్రతీకార దాడులతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచేలా కనిపిస్తోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరిస్తోంది. మరోవైపు ఇరాన్ క్షిపణి దాడులను అడ్డుకోవడంలో సాయం చేస్తే యూఎస్, యూకే , ఫ్రాన్స్ స్థావరాలు లక్ష్యంగా దాడులు చేస్తామని ఇరాన్ బెదిరించింది. 

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత.. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన

ఇరాన్, ఇజ్రాయెల్ మద్య ఉద్రిక్తతలు పెరిగితే ప్రాంతీయ సంఘర్షణకు దారి తీసే ప్రమాదం ఉన్నందున ఇజ్రాయెల్ కు యూఎస్ సైనిక మద్దతునుపెంచింది. అమెరికన్ వైమానిక రక్షణ వ్యవస్థలు ఇరానియన్ క్షిపణులను అడ్డుకోవడంలో సాయ పడ్డాయని అమెరికన్ రక్షణ అధికారి చెప్పడం ప్రత్యక్షంగా అమెరికా జోక్యాన్ని ఇరాన్ తప్పుపడుతోంది. క్షిపణి దాడులను అడ్డుకుంటే అమెరికా సైనిక స్థావరాలపైకూడా దాడులు తప్పవని హెచ్చరించింది. 

అంతర్జాతీయంగా ఉద్రిక్తతలను తగ్గించాలని పిలుపులు వస్తున్నప్పటికీ రెండు వైపులా వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. దీంతో రెండు దేశాలు మరింత సైనిక చర్యకు పాల్పడే అవకాశం గంట గంటకూ పెరుగుతోంది.