
కాబూల్ ఎయిర్ పోర్ట్ లో మరోసారి దాడులు జరగొచ్చని అమెరికా హెచ్చరించింది. 24 నుంచి 36 గంటల్లో ఎయిర్ పోర్టు దగ్గర ఆత్మాహుతి దాడి జరగొచ్చని బలంగా నమ్ముతోంది అమెరికా. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన విడుదల చేశారు. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పారు. ఎయిర్ పోర్ట్ పై ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నారు. వచ్చే 24 నుంచి 36గంటల్లో దాడి జరగొచ్చని తమ కమాండర్లు తనకు తెలిపారని బైడెన్ చెప్పారు. ఈ నెల 26న ISIS-K జరిపిన ఆత్మాహుతి దాడిలో 169 ఆఫ్గన్ పౌరులతో పాటు... 13 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు.