మరికల్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల మంజూరుతో పేదలకు గూడు కల్పిస్తున్నామని నారాయణపేట డీసీసీ మాజీ అధ్యక్షుడు కె.శివకుమార్రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం మండల కేంద్రంలో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు సభ్యుల తరపున ప్రచారం చేశారు.
రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ మరికల్ మండలం ఏర్పాటుకు మొదటగా ఫైల్ తయారు చేసింది తానేనని గుర్తు చేశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఏమి చేయలేదని విమర్శించారు. రెండేండ్ల పాలనలో కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ఇండ్లు, రేషన్కార్డులు, రైతులకు రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ మద్దతుదారులకు ఓట్లేసి గెలిపించాలని కోరారు.

