కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలోని 6 కోర్టుల్లో శనివారం నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్లో 191 కేసులను పరిష్కరించారు. ఇరు వర్గాలతో మాట్లాడి రాజీ కుదిర్చారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సీహెచ్వీఆర్ఆర్ వరప్రసాద్ మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా కేసులను వేగంగా పరిష్కరించుకోవచ్చన్నారు. మళ్లీ అప్పీల్కు వెళ్లే అవకాశం ఉండదన్నారు. న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి నాగరాణి, జడ్జీలు సుధాకర్, బి.దీక్ష, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, అడ్వకేట్లు పాల్గొన్నారు.
బోధన్లో 708 కేసులు పరిష్కారం
బోధన్ : బోధన్లోని కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్లో 708 కేసులు పరిష్కారమైనట్లు ఐదో అదనపు జిల్లా న్యాయమూర్తి డి.వరూధిని తెలిపారు. జరిమానా రూపంలో రూ.13లక్షలకుపైగా ప్రభుత్వ ఖజానాకు చెల్లించినట్లు తెలిపారు.
