కామారెడ్డిలో పోలీసుల తనిఖీలు

 కామారెడ్డిలో పోలీసుల తనిఖీలు

కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని  రైల్వే స్టేషన్,  కొత్త బస్టాండుల్లో  మంగళవారం  పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు.  ఢిల్లీలో బాంబు పేలుళ్ల దృష్ట్యా ఆయా ఏరియాల్లో ముందస్తుగా  తనిఖీలు నిర్వహించారు.   అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో  రైల్వే స్టేషన్, బస్టాండుల్లో బాంబు స్క్వాడ్​,  డాగ్​ స్క్వాడ్​తో తనిఖీలు చేశారు. ప్రయాణికుల బ్యాగులు,  ఆయా చోట్ల అనుమానాస్పదంగా ఉన్న వస్తువులను చెక్​చేశారు.  టౌన్​ సీఐ నరహరి తదితరులు ఉన్నారు.