తాగిన మైకంలో కొడుకును చంపిన తండ్రి.. మెదక్ జిల్లాలో దారుణం

తాగిన మైకంలో కొడుకును  చంపిన తండ్రి.. మెదక్ జిల్లాలో దారుణం

మెదక్, వెలుగు: కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కన్న కొడుకును దారుణంగా చంపేశాడు. మెదక్  రూరల్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్  మండలం పెద్దబాయి తండాకు చెందిన బదావత్  భాస్కర్​కు అదే మండలం తిమ్మక్కపల్లి తండాకు చెందిన లావణ్యతో ఆరేళ్ల కింద పెళ్లి  జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. కాగా, కొంత కాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వారం రోజుల కింద లావణ్య భర్తతో గొడవ పడి పిల్లలను వదిలేసి తల్లిగారింటికి వెళ్లిపోయింది.

 శనివారం రాత్రి తాగిన మైకంలో భాస్కర్​ చిన్న కొడుకు బదావత్​ లక్కీ(రెండున్నరేళ్లు) గొంతుకు స్వెటర్​ నాడా బిగించి చంపేశాడు. ఆదివారం విషయం వెలుగులోకి రాగా, రూరల్​ పోలీసులు బాలుడి డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం మెదక్  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భాస్కర్​ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.