నైనీ కోల్మైన్ బొగ్గు రవాణాకు రైల్వే రేకులు

నైనీ కోల్మైన్ బొగ్గు రవాణాకు రైల్వే రేకులు
  • ఒడిశాలో​ రైల్వే ఆఫీసర్లతో సింగరేణి కీలక మీటింగ్ లో కీలక నిర్ణయం

కోల్​బెల్ట్​,వెలుగు : ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్​నుంచి బొగ్గు రవాణాకు గురువారం సింగరేణి కంపెనీ, సంబల్పూర్​ రైల్వే డివిజన్​ ఆఫీసర్లతో మీటింగ్ జరిగింది. సింగరేణి ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్,చీఫ్​ విజిలెన్స్​ ఆఫీసర్​ బి.వెంకన్న జాదవ్​ఆధ్వర్యంలో సంబాల్పూర్ లో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. నైనీ ఓపెన్​కాస్ట్​ మైన్​లో ఉత్పత్తయ్యే బొగ్గును సమీపంలోని జారపాడ, హండప్పా రైల్వే గూడ్స్​షెడ్ల నుంచి రవాణా, లోడింగ్, హ్యాండ్లింగ్, స్టాక్, మౌలిక వసతుల ఏర్పాటు, పర్మిషన్లపై ఆఫీసర్లు సమీక్షించారు. 

రోజూ మూడు రేక్​ల వరకు బొగ్గు రవాణా కేటాయింపుకు సంబల్పూర్​ రైల్వే డివిజన్​ ఆఫీసర్లు అంగీకరించారు. దీంతో తమిళనాడు, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు సరఫరా మరింత స్పీడ్​ కానుందని ఆఫీసర్లు తెలిపారు.  సంబల్పూర్​ రైల్వే డివిజన్​ఏడీఆర్​ఎం మంజీత్ సింగ్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ ఆఫీసర్ గరీమా, డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ కుముద్ రంజన్, సింగరేణి ఆఫీసర్లు పాల్గొన్నారు.