ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్​ : ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్​ : ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

అమ్రాబాద్, వెలుగు: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పేర్కొన్నారు. స్థానిక ఓ ఫంక్షన్  హాల్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్  అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు. రాజీవ్  యువ వికాస్  పథకంతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని చెప్పారు. హౌసింగ్  పీడీ సంగప్ప, హరి నారాయణ గౌడ్, రామలింగయ్య యాదవ్, ఎడ్ల ఆనంద్, ఎంపీడీవోలు లింగయ్య, వెంకటయ్య, ఏఎంసీ వైస్  చైర్మన్  వెంకటయ్య, అవుట శ్రీనివాసులు పాల్గొన్నారు.

మృతుడి కుటుంబానికి పరామర్శ..

ఉప్పునుంతల: మండలంలోని లతీపూర్  గ్రామానికి చెందిన కాంగ్రెస్  గ్రామ అధ్యక్షుడు లచ్చింపతి నాయక్  సోదరుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శనివారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికసాయం అందించారు. కట్ట అనంత రెడ్డి, అంతటి శేఖర్ గౌడ్, ఎడ్ల జగన్, నరేశ్ యాదవ్, ఎడ్ల మధు యాదవ్, రమేశ్ యాదవ్  ఉన్నారు. 

నాగర్ కర్నూల్ టౌన్: తాడూరు, తెల్కపల్లి మండల కేంద్రాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి పంపిణీ చేశారు. ఇల్లు ప్రతి ఒక్కరి కల అని, ఆ కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇండ్ల పథకం లక్ష్యమని తెలిపారు.

కందనూలు: బిజినేపల్లిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో 685 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్​ను నాగర్​కర్నూల్​ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి అందజేశారు. పేదలకు న్యాయం చేసేది కాంగ్రెస్  ప్రభుత్వమేనని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాములు, వీరేందర్, హరీశ్ రెడ్డి, బాలపీరు పాల్గొన్నారు.