
ఆదిలాబాద్టౌన్, వెలుగు: ఆదిలాబాద్ జోగు రామన్న కాలనీలో ప్రభుత్వ భూమి కబ్జా ను బయట పెట్టిన బీజేపీ లీడర్ గండ్రత్ మహేందర్ ను బెదిరించడం సరికాదని జడ్పీ చైర్మన్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహసిని రెడ్డి అన్నారు. జోగు రామన్న కాలనీని మంగళవారం ఆమె లీడర్లతో కలిసి సందర్శించి మాట్లాడారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మున్సిపాలిటీకి గండ్రత్ మహేందర్ ను రావొద్దని బెదిరించడం సమంజసం కాదన్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికా అని ప్రశ్నించారు. కబ్జా చేసిన స్థలాలకు ఎమ్మెల్యే పేరు పెట్టడం ఏంటన్నారు. బీజేపీ లీడర్ల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆదిలాబాద్ఎమ్మెల్యే జోగు రామన్న కుమారుడు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ల బినామీ వైస్ చైర్మన్ జహీర్రంజానీ అన్నారు. వాళ్ల పేరుతో జహీర్రంజానీ ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నాడని ఆరోపించారు. ఆమె వెంట పార్టీ లీడర్లు ఉన్నారు.