
- అధికారికంగా జయంతి వేడుకలు
- మంచిర్యాల జిల్లాలో సంబురాలు
- కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాలు
నెట్వర్క్, వెలుగు: తెలంగాణ ఉద్యమనేత, కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) బడుగుల ఆశాజ్యోతి, సింగరేణి సంస్థను కాపాడిన గొప్ప నేత అని వక్తలు అన్నారు. ఆదివారం కాకా 96వ జయంతి వేడుకలను మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అభిమానులు, కాంగ్రెస్ నేతలు, మాల సంఘం, వివిధ వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. జిల్లాలోని పట్టణాలు, మండల కేంద్రాల్లో కాకా విగ్రహాలు, ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేకులు కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. క్యాతనపల్లి మున్సిపల్ ఆఫీస్లో కమిషనర్గద్దె రాజు ఆధ్వర్యంలో, చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వేడుకలు నిర్వహించారు.
ఐఎన్టీయూసీ సెంట్రల్ సెక్రటరీ బరపటి మారుతీ ఆధ్వర్యంలో అన్ని యూనియన్ల లీడర్లతో కలిసి శ్రీరాంపూర్సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిపై జయంతి వేడుకలు జరిపారు. -అణగారిన వర్గాల సంక్షేమానికి పాటుపడ్డారని కొనియాడారు.
యూనిఫాంలు, నిత్యావసరాల పంపిణీ
క్యాతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ లీడర్లు మందమర్రి మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్పార్వతి విజయ ఆధ్వర్యంలో డప్పు కళాకారులకు యూనిఫామ్లు, పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. గాండ్ల సమ్మయ్య పాల్గొన్నారు. చెన్నూరు పట్టణంలోని అన్నపూర్ణ వృద్ధాశ్రమంలో అనాథలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఐఎన్టీయూసీ లీడర్, వివేక్యువసేన వ్యవస్థాపక ప్రెసిడెంట్ బరపటి మారుతి, యూత్కాంగ్రెస్ సెక్రటరీ తోకల సురేశ్ యాదవ్, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సాయి అంధుల దృష్టి స్కూల్ విద్యార్థులకు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.
జిల్లా వ్యాప్తంగా అన్నదానాలు
మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలో కాంగ్రెస్నేతలు పిన్నింటి రఘునాథ్ రెడ్డి, సుదమల్ల హరికృష్ణ, నస్పూర్లోని సీసీసీ కార్నర్ వద్ద బరపటి మారుతి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. చెన్నూరు నియోజకవర్గంలోని రామకృష్ణాపూర్లోని పార్టీ ఆఫీస్వద్ద, మందమర్రిలోని క్యాంపు ఆఫీస్, చెన్నూరులోని కొత్త బస్టాండ్ఏరియాలో, మండల కేంద్రాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మాల సంఘం జిల్లా లీడర్లు జూపాక సుధీర్, పొట్ట మధుకర్, గజెల్లి లక్ష్మణ్ పాల్గొన్నారు. కాకా సేవ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల యాదగిరి ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో ఆల్పాహారం పంపిణీ చేశారు.