ఆంధ్రప్రదేశ్‌లో 60 వేల మంది గిరిజన పిల్లల్లో పౌష్టికాహార లోపం: కేంద్రం ఆందోళన

 ఆంధ్రప్రదేశ్‌లో 60 వేల మంది గిరిజన పిల్లల్లో పౌష్టికాహార లోపం: కేంద్రం ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన పిల్లల్లో పౌష్టికాహార లోపం చాల పెద్ద సమస్యగా మారుతుంది. కొత్తగా  వచ్చిన వివరాలు చూస్తే, ఈ పిల్లలు ఇంకా సరైన పౌషిటకాహారం  అందక బాధపడుతున్నారని తెలుస్తోంది. ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం రాష్ట్రంలో 5 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న 60,000 మందికి పైగా గిరిజన పిల్లలు వివిధ రకాల పౌషిటకాహారం లోపంతో బాధపడుతున్నారు. జూన్ 2025 నాటి పోషన్ ట్రాకర్ డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన ప్రాంతాల్లో 33,143 మంది ఎదుగుదల లోపం ఉన్న పిల్లలు, 10,039 మంది బలహీనమైన పిల్లలు, 18,620 మంది తక్కువ బరువున్న పిల్లలుగా గుర్తించబడింది.

 తరచుగా వచ్చే పౌష్టికాహార లోపం వల్ల పిల్లల పెరుగుదల, అభివృద్ధి దెబ్బతినడం ఎదుగుదల లోపాన్ని చూపిస్తుంది.  దీని ముఖ్య లక్షణం వయస్సుకు తగ్గ ఎత్తు లేకపోవడం.  బక్కగా చిక్కిపోవడం అనేది తీవ్రమైన పౌషిటకాహారం లోపాన్ని సూచిస్తుంది. దింతో పిల్లలు  ఎత్తుకు తగ్గ బరువు ఉండరు. వయస్సుకు తగ్గ బరువు లేకపోవడం కూడా పౌష్టికాహార లోపం వల్ల ఏర్పడవచ్చు.

ఇవన్నీ పౌష్టికాహార  లోపాలను ఎత్తి చూపడమే కాకుండా, గిరిజన ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణ అందుబాటులో లేకపోవడం, ప్రసూతి గురించి అవగాహన లేకపోవడం, సరైన పౌష్టికాహార అందక పోవడాన్ని కూడా సూచిస్తున్నాయి.

ALSO READ : గూడూరు మండలంలో భీమునిపాదం పరవళ్లు.. పర్యాటకుల కేరింతలు

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 (2019-21) నుండి అందిన వివరాల ప్రకారం, భారతదేశంలోని 5 సంవత్సరాల లోపు గిరిజన పిల్లల్లో 44.5% మంది ఎదుగుదల లోపంతో, 20% మంది చిక్కిపోయి, 45.2% మంది తక్కువ బరువుతో ఉన్నారని తెలుస్తోంది.

రక్తహీనతతో బాధపడుతున్న  గిరిజన మహిళలు: మరోవైపు 15-49 ఏళ్ల వయస్సు ఉన్న గిరిజన మహిళల్లో 62.6% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు ఇంకా  21% మంది బాడీ మాస్ ఇండెక్స్ (BMI) సాధారణ స్థాయిల కంటే తక్కువతో ఉన్నారు, ఇవన్నీ గిరిజన మహిళల్లో పెరుగుతున్న పౌష్టికాహార సవాళ్లను కూడా హైలైట్ చేస్తుంది.

ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాతీయ ఆరోగ్య మిషన్ కింద పునరుత్పత్తి, ప్రసూతి, నవజాత శిశువు, శిశు, కౌమార ఆరోగ్యం ఇంకా పౌషిటకాహారం (RMNCAH+N)  ద్వారా చాల రకాల కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు పేర్కొంది. తీవ్రమైన పౌష్టికాహార లోపం (SAM) ఉన్న పిల్లల ఇన్-పేషెంట్ సంరక్షణ కోసం పౌష్టికాహార పునరావాస కేంద్రాల (NRCs) స్థాపన & ప్రారంభ ఇంకా ప్రత్యేకమైన తల్లిపాలను ప్రోత్సహించడానికి తల్లుల సంపూర్ణ ప్రేమ (MAA) కార్యక్రమం కూడా ఇందులో ఉన్నాయి.

ఈ సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాతీయ ఆరోగ్య మిషన్ కింద  పునరుత్పత్తి, ప్రసూతి, నవజాత శిశువు, శిశు, కౌమార ఆరోగ్యం ఇంకా పౌషిటకాహారం (RMNCAH+N) ఇలా చాల కార్యక్రమాలను చేపడుతుంది.  దీనితో పాటు, తీవ్రమైన పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలకు చికిత్స అందించడానికి పౌష్టికాహార పునరావాస కేంద్రాల (NRCs) ఏర్పాటు, అలాగే తల్లిపాలను  ప్రోత్సహించడానికి తల్లుల సంపూర్ణ ప్రేమ (MAA) కార్యక్రమం వంటివి కూడా అమలు చేస్తుంది.

రక్తహీనతను తగ్గించేందుకు రక్తహీనత ముక్త్ భారత్ (AMB) కార్యక్రమం కింద  ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి  జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం (NDD) నిర్వహిస్తున్నారు.  వీటితో పాటు, తల్లీబిడ్డల ఆరోగ్య సేవలను అందించడానికి, అలాగే మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖతో కలిసి పౌషిటకాహారం పై అవగాహన పెంచడానికి గ్రామ ఆరోగ్యం, పారిశుధ్యం & పౌష్టికాహార దినోత్సవాలు (VHSNDలు) క్రమం నిర్వహిస్తున్నారు. అయితే, ఇన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా గిరిజన వర్గాల్లో పౌష్టికాహార లోపాన్ని తగ్గించడానికి మరింత కృషి అవసరం అని  చూపిస్తుంది.