
గూడూరు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం శీతానగరం శివారులో ఉన్న భీముని పాదం జలపాతంలో పార్యాటకులు ఆదివారం సందడి చేశారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం సెలవు కావడంతో జలపాతం వద్ద పర్యాటకులు సంతోషంగా గడిపారు. పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేసి ముందస్తు చర్యలు తీసుకున్నారు.