మలేషియా ఓపెన్ లో సత్తా చాటిన పీవీ సింధు

మలేషియా ఓపెన్ లో సత్తా చాటిన పీవీ సింధు

భారత షట్లర్ పీవీ సింధు సత్తా చాటింది. మలేషియా మాస్టర్స్‌లో చైనాకు చెందిన జాంగ్ యిూ మాన్‌పై వరుస గేమ్‌లలో విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. మహిళల సింగిల్స్  ప్రీక్వార్టర్స్ లో సింధు  21-,12, 21-, 10  తేడాతో  జాంగ్ యిూ ను ఓడించింది.  28 నిమిషాలు పాటు జరిగిన ఈ మ్యాచ్ లో సింధు  రెండు రౌండ్‌ లలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి క్వార్టర్‌లోకి ప్రవేశించింది. ఇదిలా ఉంటే, పురుషుల సింగిల్స్ పోరులో షట్లర్ సాయి ప్రణీత్ మాత్రం నిరాశపరిచాడు. చైనాకు చెందిన లీ షి ఫెంగ్ చేతిలో 21-,14, 21-,17తో ఓడిపోయాడు.