బీజేపీ అంటే భారతీయ చెంబుపార్టీ అని సెటైర్ వేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. బళ్లారీలో ఎన్నికప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజాధనాన్ని దోచుకున్న బీజేపీ రాష్ట్రాలకు ఖాళీ చెంబు ఇచ్చిందని ధ్వజమెత్తారు. భారతీయ చెంబు పార్టీ, ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ, కర్ణాటక నుంచి కేంద్రానికి రూ. 100 పన్నుల రూపంలో ఇస్తే.. రాష్ట్రానికి తిరిగి రూ. 13 ఇస్తున్నారని విమర్శించారు. కేంద్రాన్ని రూ. 18 వేల కోట్లు ఇవ్వాలని కోరితే.. ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెసా పార్టీకి శక్తి ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గ్యారంటీలతో పాటు కేంద్రం ప్రకటించిన గ్యారంటీలను అమలు చేస్తామని రాహుల్ తెలిపారు.
కేంద్రంలో అధికారంలోకి రాగానే గ్రామాలు,పట్టణాలు, నగరాల్లో ఇంటింటి సర్వే చేసి ప్రతి మహిళలకు లక్ష జమ చేస్తామని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. రైతులు పండించిన పంటలపై కూడా కేంద్రం ప్రభుత్వం పన్నులు వేస్తుందని మండిపడ్డారు రాహుల్. తాము అధికారంలోకి వస్తే జీఎస్టీని మరింత ఈజీ చేస్తామని చెప్పారు.