
న్యూడిల్లీ: సీమెన్స్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ (ఎస్ఈఐఎల్) నికర లాభం ఈ ఏడాది -మార్చి క్వార్టర్లో ఏడాది లెక్కన 36.34 శాతం పెరిగి రూ.246.1 కోట్లకు చేరింది. విద్యుత్ పంపిణీ, ఉత్పత్తి విభాగం నుంచి భారీగా ఆదాయం వచ్చిందని కంపెనీ తెలిపింది. గత సంవత్సరం రెండవ క్వార్టర్లో కంపెనీ రూ.180.5 కోట్ల లాభాన్ని ప్రకటించింది.
కంపెనీ అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది. మార్చి క్వార్టర్లో కంపెనీ మొత్తం ఆదాయం రూ.1,893.9 కోట్లకు చేరుకుంది.