
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికులకు సొంతిల్లు, ఇన్కమ్ట్యాక్స్రద్దు డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర కార్మిక, మైనింగ్శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకవెళ్లామని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ అన్నారు. మంగళవారం మందమర్రి ఏరియా వర్క్షాప్లో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. కార్మికుల డిమాండ్ల పట్ల మంత్రి వివేక్ సానుకూలంగా స్పందించారని, విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
కార్మికుల హక్కులు, డిమాండ్ల సాధన కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటాలు చేస్తోందన్నారు. ఏఐటీయూసీ యూనియన్ను కార్మికవర్గం ఆదరించడాన్ని జీర్ణించుకోలేక ఐఎన్టీయూసీ లీడర్లు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్భీమనాథుని సుదర్శనం, పిట్ సెక్రటరీ ప్రభాకర్ శర్మ, బ్రాంచి జాయింట్ సెక్రటరీ కంది శ్రీనివాస్, వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, తోట వెంకటస్వామి, లీడర్లు రాజేశ్వర్, పి.బానయ్య, ఎస్.రాజేశం, టి.తిరుపతి, పిట్సెక్రటరీలు పాల్గొన్నారు.