
- ఎస్పీ నరసింహ
సూర్యాపేట, వెలుగు: ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, ప్రజలు కూడా సహకరించాలని ఎస్పీ నరసింహ కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పొట్టిశ్రీరాములు సెంటర్, రాఘవ ప్లాజా, వాణిజ్య భవన్ సెంటర్లో శుక్రవారం రాత్రి ట్రాఫిక్ పరిస్థితి, రోడ్లపై దుకాణాలు, వ్యాపారాలను పరిశీలించారు.
వాహనదారులకు ఇబ్బంది, ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వ్యాపారాలు నిర్వహించుకునేలా చూడాలని పోలీస్సిబ్బందికి సూచించారు. వ్యాపారులు రోడ్లను ఆక్రమించొద్దని చెప్పారు. ట్రాఫిక్ ఎస్సై సాయిరాం, సిబ్బంది ఉన్నారు.