- ఎస్పీ రాజేశ్చంద్ర
- హైవేపై పోలీసుల విస్తృత తనిఖీలు
- మద్యం సేవించి వెహికల్స్ నడిపిన 27 మందిపై కేసు, ప్రైవేట్ బస్సు సీజ్
కామారెడ్డి, వెలుగు : మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాజేశ్చంద్ర పేర్కొన్నారు. గురువారం రాత్రి జిల్లాలోని హైవేపై విస్తృత తనిఖీలు చేపట్టారు. భిక్కనూరు మండల కేంద్రానికి సమీపంలో హైవే 44 టోల్ప్లాజా వద్ద భిక్కనూరు సీఐ సంపత్కుమార్ ఆధ్వర్యంలో 8 టీమ్స్ తనిఖీల్లో పాల్గొన్నాయి.
1,139 వెహికల్స్ నడిపే వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. 27 మంది మద్యం తాగగా కేసులు నమోదు చేశారు. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 45 మంది ప్రయాణికులతో వెళ్తుండగా, డ్రైవర్ మద్యం సేవించినట్లు గుర్తించారు. బస్సును సీజ్ చేసి డ్రైవర్ను అరెస్టు చేశారు. మరో బస్సులో ప్రయాణికులను పంపారు.
